ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన అంతర్గం మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... రామగుండంలో నివాసముండే బానోతు రమేష్ బ్రాహ్మణపల్లి వద్ద విద్యుత్ మరమ్మత్తులు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చెట్ల మధ్యలో అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తూ ఉండగా హై టెన్షన్ వేరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Admin
Aakanksha News