ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : వడ్ల మిల్లింగ్ వివరాలను, రైతుల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.సోమవారం నాడు ఆయన కడ్తాల్ ఆమన గల్లు మార్గం లో ఉన్న రైస్ మిల్లు లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొందరు మిల్లర్లు వడ్ల ను ఇష్టానుసారం కొని మిల్లింగ్ చేస్తున్నారని వారు నిర్ణీత పద్ధతిలో వడ్ల పరిమాణం,రైతుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. రేషన్ బియ్యం ను కొన్ని మిల్లులో కొని దందా చేస్తున్నారన్న ఆరోపణలు ఫిర్యాదుల నేపథ్యం లో.. రైస్ మిల్లు లను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు
Admin
Aakanksha News