ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు గైరాన్ ఇచ్చిన భూములను ధరణి పోర్టల్ లో నమోదు కాకపోవడంతో దళిత రైతులు నష్టపోతున్నారని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. దళితుల గైరాన్ భూములను ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని ఆయన కోరారు.
Admin
Aakanksha News