Friday, 11 July 2025 05:23:31 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసి అధికారి....

కాప్రా వర్గంలో ఎంబి నమోదు కోసం రూ. 1.20 లక్షల డిమాండ్...

Date : 17 June 2025 08:44 PM Views : 394

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కాప్రా వర్గానికి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. స్వరూప లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎంబి (మెజర్ బుక్) నమోదు చేయడంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ. 1,20,000 లంచం డిమాండ్ చేసిన స్వరూపను, ఎలాంటి అనుమానం లేకుండా లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూలాల ప్రకారం, ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇటీవల జిహెచ్ఎంసి పరిధిలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను పొందేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం అవసరమైన ఎంబి నమోదు చేయాలని సంబంధిత శాఖకు విన్నవించగా, బి. స్వరూప రూ. 1.20 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు వెంటనే ఎసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి పర్యవేక్షణలో ముందస్తు విధివిధానాల ప్రకారం ప్లాన్ వేసి లంచం తీసుకుంటున్న సమయంలో స్వరూపను పట్టుకున్నారు.ఇంజనీర్ స్వరూపను అరెస్ట్ చేసిన అనంతరం అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఇటువంటి అవినీతి చర్యలు వెలుగుచూస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుండగా, అధికారుల చేతుల్లో అవినీతి ఆటల కారణంగా ప్రజలకు నష్టమవుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, స్వరూపను విధుల నుంచి తొలగించి, అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :