Thursday, 25 June 2026 07:45:22 PM

రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..ఆందోళన వద్దు...

సెలూన్‌ లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు...బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Date : 04 January 2024 09:27 PM Views : 648

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెలూన్‌ లాండ్రీ, ధోబీఘాట్‌లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు. ఎవరు అధైర్యపడవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్నిఅమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని ఈ మేరకు మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :