Saturday, 18 January 2025 08:24:03 AM

అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు...

Date : 03 October 2024 05:13 PM Views : 88

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో క్రికెటర్‌,రాజకీయవేత్త అయిన మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసింది.ఈడి ఎదుట గురువారం హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్‌ నేతకు అందిన తొలి సమన్లు ఇవి. అయితే మాజీ భారత కెప్టెన్ సమయం కోరాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు , క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ. 20 కోట్ల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది.పరిశీలనలో ఉన్న ఆర్థిక లావాదేవీలలో అతని పాత్రపై స్పష్టత ఇవ్వడానికి ఏజెన్సీ ముందు హాజరుకావాలని సూచించడంతో, కాంగ్రెస్ నాయకుడికి దర్యాప్తు సంస్థ సమన్లు పంపడం ఇదే మొదటిసారి. నవంబర్ 2023లోఈడి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం తెలంగాణలోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఎస్ఎస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ఆవరణలో, దాని ఎండి సత్యనారాయణ నివాస ప్రాంగణంలో కూడా సోదాలు జరిగాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు