ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... అర్హులైన వారందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని. అలాగే తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఆర్కే టేషన్ కలిగిన జర్నలిస్టుల అందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని తెలిపారు. కెసిఆర్ బీమా కింద ఐదు లక్షల రూపాయల సాధారణ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ పథకం 93 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే పెన్షన్లు పెంచడంతోపాటు ఆరోగ్యశ్రీ పథకం ను 15 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Admin
Aakanksha News