ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మౌంట్ మాంగనీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దవడంతో ఈ మ్యాచ్ పై ఇరుజట్లు దృష్టి పెట్టాయి.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉండటంతో ఇరుజట్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Admin
Aakanksha News