ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎం. శ్రీనివాసులు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నర్సింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐలు, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా సీపీని కలసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ, ఏసీపీలతో సమీక్ష నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అనే దానిపై తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Admin
Aakanksha News