ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నక్షలైట్లమాని ఎయిర్ గన్స్ తో బెదిరించిన నిందితుల అరెస్టు వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి రామగుండం సీపీ మాట్లాడుతూ..మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ సిబ్బందితో కలిసి సిసిసి నస్పూర్ లోని తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని క్షుణ్ణంగా విచారించగా, నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి.వెంకటేష్, పెద్దంపేటకు చెందిన ఆరేందుల.రాజేష్ ఈ ఇద్దరు నిందితులు చిన్నపటి నుండి మిత్రులు కాగా గత కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఇద్దరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సాధించాలని ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరుతో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనీ ఆలోచించి రాజేష్ తను చెప్పినట్లు వింటే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని వెంకటేష్ ని ఒప్పించి, గత కొంత కాలం నుండి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా, కలిసినపుడే మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకోన్నారని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుండి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరుతో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి ఫోన్, సిమ్ కొనుగోలు చేసారు. తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, గత నెల ఫిబ్రవరి 21 నాడు రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని వచ్చి అర్దరాత్రి సమయంలో కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, మరియు అతని కొడుకు నాగరాజుల కి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుండి నక్సలైట్ లము మాట్లాడుతున్నాం మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతాం అని బెదిరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన విధానంలో దర్యాప్తు చేయగా నింధితుల ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగిందని సీపీ తెలిపారు. రాజేష్ మీద గతంలో మంచిర్యాల , హాజీపూర్ ఏరియాలలో పలు కేసులు నమోదు అయ్యాయాని అన్నారు. నిందితుల నుండి PRECIHOLE SPORTS VS100 Air Gun, RANGER Air Gun,పల్సర్ బైక్ , SAMSUNG మొబైల్ స్వాదీనం చేసుకోన్నామని సీపీ తెలిపారు.నిందితులను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బి.సంజీవ్, మంచిర్యాల రూరల్ SI ఎం.రవికుమార్,సీసీసీ నస్పూర్. ఎండీ. సలీం, బి.దేవేందర్, శ్రీధర్ పిసి, ఇర్షాద్ పీసీలకు సీపీ రివార్డ్ అందజేసి అభినందించారు.
Admin
Aakanksha News