Monday, 10 August 2026 12:56:03 PM

అడ్డదారి తొక్కుతున్న అధికారం...⁉️

Date : 15 February 2023 12:40 PM Views : 680

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అధికారం అడ్డదారి తొక్కుతుంది... గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన ఓ ప్రజా ప్రతినిధి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపదలో ఉన్న వారిని కాపాడే వైద్యులను దేవుళ్ళతో సమానంగా భావిస్తారు. ఇలాంటి వైద్య వృత్తిలో ఉన్న కొంత మంది చేస్తున్న చర్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇందుకు సంబంధించి ఓ ప్రజా ప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం సదురు ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు సైతం కోకోల్లోలుగా ఉన్నాయి. అయితే స్కానింగ్ సెంటర్ వివాదం పారిశ్రామిక ప్రాంతంలో చర్చకు దారితీస్తుంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :