ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మునుగోడు బైపోల్ లో ఇప్పటి వరకు 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.స్కూట్ని లో ఎగిరి పోగా మిగిలిన 83 మంది అభ్యర్థుల బరిలో నేడు 10 మంది ఇండిపెండెంట్ లు బరిలో నుంచి తప్పు కోవడంతో అభ్యర్థుల సంఖ్య 73 కు చేరుకుంది. రేపు మధ్యాహ్నం 3 గం. వరకు నామినేషన్ ఉప సంహరణ గడువు ముగుస్తంది. ఈ లోపు ఎంత మంది అభ్యర్థులు తమనామినేషన్ ను ఉపసంహరించుకుంటారో వేచి చూడాల్సిందే..ఉపసంహరణ కు తీవ్ర ప్రయత్నాలను ప్రధాన పార్టీల నేతలు చేస్తున్నారు. దీంతో ఓట్ల చీలిక ఆయా పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అభ్యర్ధులను పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు.
Admin
Aakanksha News