ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బిజెపి కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి ఓదెలుతో పాటు మరి కొంత మంది ఆదివారం బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి సంధ్యారాణి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. రామగుండం నియోజకవర్గంలో సరైన నాయకత్వం వహిస్తున్న ఏకైక మహిళ నాయకురాలు కందుల సంధ్యారాణి అని వారి ఆధ్వర్యంలో బీజేపీ లో చేరడం చాలా గొప్పగా భావిస్తున్నానని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి జెండా ఎగరడానికి మేమంతా కృషి చేస్తామని తెలిపారు.
Admin
Aakanksha News