ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రజా ఆమోద యోగ్యమైన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామగుండం కార్పోరేషన్ కో ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను ముస్లీ మహిళలు స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ముస్లింలకు, మహిళ సంక్షేమానికి సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో లో పెద్దపీట వేసారన్నారు. రామగుండం నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ఎన్నికల్లో భారీ మెాజార్టితో విజయం సాధించడం ఖాయమన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చందర్ సకల వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారని ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నహిమా ఫార్జానా సల్మా రేష్మా సానియా అలియా తాబుసుం హేమా గౌసియా ఫారిదా తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News