Friday, 11 July 2025 04:37:07 AM

దళిత స్పీకర్‌ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడికి యత్నించడం బాధాకరం...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం

Date : 20 December 2024 04:55 PM Views : 318

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : శాసన సభలో దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎంఎల్ఎలు దాడికి యత్నించడం బాధాకరమైన విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో దౌర్జన్యం, రౌడీయిజం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. శాసన సభలో భూభారతి బిల్లుపై చర్చను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగించారు. రైతులకు భరోసా కల్పించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం నిజాం కాలంనాటి భూసమస్యలు అని వివరించారు. నిజాం కాలంలో దళిత, గిరిజన, బిసిల భూములను అగ్రకులాలకు చెందిన వారు లాక్కున్నారన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో రేవంత్ మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్‌ఎస్ ఆందోళన చేపట్టడంతో శాసన సభలో గందరగోళం నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :