ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎలుగుబంటి కలంకాలం మొదలైంది.అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తూ ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి సంచారం ఇది మొదటిసారి కాదని ఇంతక ముందు చాలాసార్లు ఇలాగే జరిగిందని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో ఎలుగుబంటి సంచారంతో విద్యార్థులు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు స్థానిక కెమెరాలలో రికార్డు అయినట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News