ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : మావోయిస్టులు, భదత్రా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశా సరిహద్దులు దాటి చత్తీస్ ఘడ్ లోకి మావోయిస్టులు ప్రవేశించారని పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Admin
Aakanksha News