ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోట ప్రదీప్ కన్నా ఎన్నికైనారు. రాజపేట మండలం బేగంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కన్నా పి ఆర్ టి యు టి ఎస్ లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.పి ఆర్ టి యు టి ఎస్ 35 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో మన రాజపేట మండలానికి చెందిన యం.శశికుమార్, జిహెచ్ఎస్ జడ్పీహెచ్ఎస్ పారుపల్లి ,యం.శ్రీనివాసరెడ్డి, నెమిల గారు, బి .పరమేష్ మరియు కె.ప్రదీప్ కన్నాబేగంపేట రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నిక కావడం జరిగింది.ఈ సందర్భంగా వారిని జిల్లా అధ్యక్షులు కుంట్ల అమరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూధన్ మండల అధ్యక్షులు సంపతి సుబ్బరాజు , ప్రధాన కార్యదర్శి గౌటె బాలరాజు మరియు పి ఆర్ టి యు టి ఎస్, రాజపేట మండల శాఖ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియ చేశారు
Admin
Aakanksha News