ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ లో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.... వనపర్తి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో 2023 వ సంవత్సరంలోని పెయింటింగ్ సీసీ రోడ్ల కాంట్రాక్ట్ పనులకు నిధులను మంజూరు చేయడానికి వనపర్తి జిల్లా మున్సిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు 20 వేలు లంచం డిమాండ్ చేసారు. దీంతో భాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
Admin
Aakanksha News