ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలోని ఇద్దరు మాజీ కార్పొరేటర్లు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏఐసీసీ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మంథని శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు మాజీ కార్పొరేటర్లు పాతిపెల్లి రవి, చుక్కల శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోంతల రాజేష్ గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Admin
Aakanksha News