ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మునుగొడు లో బిజెపి తమ పార్టీ జెండాను ఎగురవేయాలని గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ను టార్గెట్ చేసిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చౌటుప్పల్ లోని ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ ఏర్పాటు చేస్తానని నడ్డా హామీ ఇచ్చి మర్చిపోయారంటూ ఏకంగా నడ్డాకు సమాధి కట్టారు. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి మీద వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించక ఇప్పుడు నడ్డాకు సమాధి కట్టడం తెలంగాణలో తీవ్ర చర్చనియాంశంగా మారుతుంది.
Admin
Aakanksha News