ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అవినీతి చేసి కవిత జైలుకి పోతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.మీరు చేసిన తప్పులు ఎక్కడ బయట పడుతాయో అని ముందే బిజెపి పై ఎదురు దాడి ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుందని విమర్శించారు.ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వస్తే భయం ఎందుకు? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లితే చేసిన అవినీతి వల్ల పోతుందని విమర్శించారు. అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి పోయేందుకు సిద్ధం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
Admin
Aakanksha News