Monday, 16 June 2025 03:24:31 AM

నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ అరెస్టు...

Date : 29 October 2024 06:37 PM Views : 198

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ కు సహకరించినందుకుగాను అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా మేడ్చల్ కోర్టు సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.సుభాష్ నగర్ లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. కాగా అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన జ్యోతి భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పద్మజా రెడ్డికి సహకరించింది. పోలీసులు ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్టు చేశాక, ఇప్పుడు సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని కూడా అరెస్టు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :