ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూ ఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.కోట్లు విలువైన 7 వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇందులో ఓ వాచ్ ని అమెరికాకు చెందిన జాకబ్&కో సంస్థ తయారు చేసింది. దీన్ని బంగారం, విలువైన వజ్రాలతో రూపొందించారు. ఈ ఒక్క వాచీ ఖరీదు రూ.27 కోట్ల 9 లక్షల 26 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ 7 వాచీల విలువ 60 కిలోల బంగారం విలువతో సమానమని తెలిపారు.
Admin
Aakanksha News