ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : విద్యుత్ ప్రమాదానికి గురైన వివేక్ కు కార్పొరేట్ వైద్యం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ప్రిన్సిపల్ తో పాటు సూపరిండెండ్ పై ఉందని సీపీఐ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వివెక్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మంగళవారం గోదావరిఖని లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న సందర్భంగా సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినెష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్ లు పరామర్శించారు. ప్రమాదానికి గురైనా వివెక్ కు మెరుగైన వైద్యం అందించాలని వారు ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెండ్ తో పాట ప్రిన్సిపల్,జిల్లా వైద్యాధికారులను డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News