ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘటన స్థానికులను కాసేపు భయాందోళనకు గురిచేసింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపాన తాత్కాలిక గుడిసెలలో నివాసముంటున్న ప్రజల వద్దకు కొండచిలువ ప్రవేశించింది.సమీప ప్రాంతం నుంచి వచ్చిన ఆ కొండచిలువ నేరుగా కోళ్ల గూటిలోకి వెళ్లి ఒక కోడిని మింగేసింది. ఆరుబయట కోళ్లు అరవడంతో మెలకువ వచ్చిన స్థానికులు పరిస్థితిని గమనించారు. గూటిలో భారీగా ఉన్న కొండచిలువను చూసి భయాందోళనకు గురైన వారు దానిపై దాడి చేశారు. ఈ క్రమంలో కొండచిలువ నోట్లో పట్టుకున్న కోడి బయటికి వదిలేసింది. అనంతరం ఆ కొండచిలువను పూర్తిగా చంపి దూరంగా పారవేశారు.ఆకస్మికంగా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Admin
Aakanksha News