Friday, 26 June 2026 01:14:40 AM

గోదావరిఖని గంగా బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్ మృతి

ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు...

Date : 27 June 2025 10:26 AM Views : 2019

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మంచిర్యాల నుంచి గోదావరిఖని వస్తున్న ఆటో, గంగా బ్రిడ్జి పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం మేరకు, వేగంగా వస్తున్న ఆటో బ్రిడ్జి పై నిలిచిన లారీని గమనించలేక బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న స్వప్న మరియు అజీమ్ అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్ ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :