Friday, 06 February 2026 03:42:53 AM

తెలంగాణ ఉద్యమ నేతలకు పట్టం కట్టబోతున్న ప్రజలు...

41వ డివిజన్‌లో నీరటి శ్రీనివాస్‌కు వెల్లువెత్తుతున్న ప్రజా ఆదరణ...

Date : 05 February 2026 04:29 PM Views : 239

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజల విశ్వాసం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. 60 డివిజన్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కారు గుర్తు పార్టీకి ప్రజలు తిరిగి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే మాటలు కేవలం ప్రచారం కాదు, నేలమీద కనిపిస్తున్న వాస్తవమని స్థానికులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ నాయకత్వంలో సాగుతున్న విస్తృత ప్రచారం రామగుండం రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రూపొందించిన వ్యూహాత్మక ప్రచారం ప్రతి డివిజన్‌లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా 41వ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నీరటి శ్రీనివాస్‌కు లభిస్తున్న స్పందన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. డివిజన్‌లోని ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి గడప వద్ద నీరటి శ్రీనివాస్‌కు ప్రజలు చూపుతున్న ఆదరణ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న సమయంలో బ్రహ్మహారతులు, ఆశీర్వచనాలు, అభినందనలతో ప్రజలు తమ మద్దతును బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డవారికే మా ఓటు” అనే నినాదం 41వ డివిజన్‌లో ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన త్యాగాలు, ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలే ఈ ఆదరణకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల విషయంలో గత పాలకుల కృషి తమకు గుర్తుందని, అందుకే మరోసారి అవకాశమివ్వాలనే నిర్ణయానికి వచ్చామని పలువురు ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.నీరటి శ్రీనివాస్ ప్రచారంలో సాదాసీదా భాషలో ప్రజలతో మమేకమవుతూ, డివిజన్ అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథాన్ని వివరించడమే కాకుండా, గతంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తున్నారు. “ఇది మాటల ప్రచారం కాదు, చేసిన పనుల ప్రచారం” అనే విధంగా ఆయన సాగిస్తున్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది. సమస్యలపై అవగాహనతో పాటు పరిష్కారాలపై స్పష్టత ఉండటం ఆయనకు మరింత బలంగా మారింది.ప్రజల సమస్యలను వినడమే కాదు, వాటిని పరిష్కరించాలనే పట్టుదల నీరటి శ్రీనివాస్‌లో స్పష్టంగా కనిపిస్తోందని డివిజన్ వాసులు అభిప్రాయపడుతున్నారు. యువత, మహిళలు, వృద్ధులు అన్న వర్గాల నుంచీ ఆయనకు మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటూ ఆశీర్వాదాలు ఇవ్వడం విశేషంగా మారింది.రామగుండం కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నప్పటికీ, 41వ డివిజన్‌లో మాత్రం బీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారైందన్న చర్చ సాగుతోంది. ప్రజా ఆదరణే ఆయన గెలుపుకు నాంది అని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచారం సాగుతున్న కొద్దీ నీరటి శ్రీనివాస్ ముందంజలో దూసుకుపోతున్నారని, ప్రత్యర్థులు వెనుకబడుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి రామగుండం ప్రజలు మరోసారి అండగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 41వ డివిజన్‌లో నీరటి శ్రీనివాస్‌కు లభిస్తున్న అపూర్వ ఆదరణ ఆయన విజయానికి బలమైన పునాది వేస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :