ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, ఒకటవ పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన యువకుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేసి ఇరువర్గాలను పట్టుకోవడం జరిగిందని అన్నారు. అయితే దసరా ఉత్సవాల్లో కొంత మంది యువకులు చేతులు ఒకరికొకరికి తాగిలాయాని గొడవ పడి చేతులతో కొట్టుకొని కాళ్లతో తన్నుకొని ప్రజలను ఇబ్బందులకు పెట్టారని దీంతో ఉత్సవాలు చూడటానికి వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసారని తెలిపారు.వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.భవిష్యత్తులో ఎప్పుడు కూడా మరొకసారి ఇలాంటి సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా యువకుల తల్లిదండ్రులకు పిల్లల యొక్క నడవడిక, ప్రవర్తన, వారి పనుల పైన కచ్చితంగా నిఘా ఉంచాలని వారు ఏమైనా తప్పు పనులు చేస్తే వారిని మందలించాలని అవసరమైతే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సరైన మార్గంలో పెట్టే విధంగా అన్ని ప్రయత్నాలు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్లమైన చర్యలు తీసుకుంటారని యువకుల తల్లిదండ్రులకు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రాసేనా రెడ్డి సూచించారు.
Admin
Aakanksha News