ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతు ప్రజలను వంచిస్తుందని బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం పెద్దపల్లి జిల్లాలలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలన్నారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
Admin
Aakanksha News