ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం ఏరియా-1 లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ క్వార్టర్ కౌన్సిలింగ్ లో ఎన్.సి,ఎ,బి,ఓల్డ్ బి,సి టైప్ క్వార్టర్ లకు కౌన్సిలింగ్ నిర్వహించటం జరిగిందని మొత్తం 30 క్వార్టర్ లకు గాను 30 మంది అప్లై చేసుకోవటం జరిగిందని తెలిపారు..ఇట్టి క్వార్టర్ లను అర్హత పదవిని బట్టి క్వార్టర్ లను ఇవ్వటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పిఒ హనుమంత రావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Admin
Aakanksha News