ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : బంగారం షాపులో దొంగతానానికి పాల్పడిన ముగ్గురు మహిళలను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేసారు. వివరాల్లోకి వెళ్తే... గత నెల 23వ తేదీన పెద్దపల్లి పైడ బజార్ లోని సింధూర జ్యూవెలరీ షాప్ కస్టమర్ లుగా ముగ్గురు మహిళలు వచ్చి షాపు యజమాని దృష్టి మల్లించి 3 జతల వెండి పట్ట గొలుసులను దొంగలించుకొని వెళ్లగా షాపు యజమాని కట్ట శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసారు.మొగుళ్ళపల్లి మండలానికి చెందిన ఇస్పెట్ గ్రామానికి చెందిన శనిగరపు పూలమ్మ , గుడిపాక రాధ, అన్నపూర్ణ లుగా గుర్తించి వారిని అరెస్టు చేసి దొంగలించిన మొత్తం 10 గ్రాముల 3 జతల వెండి పట్టగొలుసులను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Admin
Aakanksha News