ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : అనుమానం పెనుభూతమైంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా వివాహామాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో మంగళవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. వినయ్ అనే వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలను నరికిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News