Thursday, 25 June 2026 07:57:39 PM

ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష 4 వేల జరిమానా..

Date : 27 February 2025 09:39 PM Views : 836

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి వ్యక్తి మృతి,మరొక్కరి గాయాలకు కారణమైన వ్యక్తికి 20 నెలల జైలు శిక్ష ,4వేల జరిమానాను విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి గురువారం తీర్పునిచ్చారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ .రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్నాపూర్ గ్రామానికి చెందిన గొల్లపల్లి పొన్నం గౌడ్(48) గీత కార్మికుడు అతని భార్య పద్మ 19వ తేదీ 11నెల 2016న తమ ద్విచక్ర వాహనం పై బొక్కల గుట్టకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అల్లూరు సబ్ స్టేషన్ వద్ద 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన భీమగోని విద్యా సాగర్ ట్రాక్టర్ ను అతివేగంగా అజాగ్రత్తగా. నడిపి ద్విచక్ర వాహనం పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పొన్నం గౌడ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య పద్మకు గాయాలయ్యాయి. మృతుని బావ మరిది లద్నాపూర్ కు చెందిన పులిబాపు పిర్యాదు మేరకు అప్పటి రామగుండం ఎస్ ఐ ఎం.లక్ష్మయ్య విద్యాసాగర్ పై కేసు నమోదు చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అనంతరం టు టౌన్ ప్రస్తుత సీఐ పి..ప్రసాద రావు ,ఆధ్వర్యం లో కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎలిగేటి మల్లేశం లు సాక్షులను కోర్ట్ లో ప్రవేశ పెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నహేదఫర్హీన్ తన వాదనలు వినిపించారు. ఈరోజు నిందితుని పై నేరం రుజువు కావటం తో న్యాయ మూర్తి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ గారు ,డీ సి పి చేతన ఐపిఎస్., గారు ,ఏ సి పి మడత రమేష్ గారు అభినందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :