ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే... ఎనిమిదో వార్డుకు చెందిన నక్క సందీప్ కుమార్ (33) అనే యువకుడు హైదరాబాదులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మల్కాజిగిరి పరిసర ప్రాంతంలో నివాసముంటున్న సందీప్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News