ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జోగులంబ గద్వాల జిల్లా : శుభకార్యానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి, లక్ష్మిసుబ్బమ్మ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఇటిక్యాల మండలంలోని 44వ జాతీయ రహదారిపై ప్రియదర్శి హోటల్ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధర్మారెడ్డి అనే వ్యక్తి కుటుంబీకులతో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Admin
Aakanksha News