ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News