ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పశ్చిమగోదావరి జిల్లా : పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకొని ఓ ఎస్.ఐ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News