Friday, 05 December 2025 05:25:55 AM

చేవెళ్ల మండ‌లం ఆలూరు స్టేజీ వ‌ద్ద ఓ లారీ బీభ‌త్సం...

అక్క‌డికక్క‌డే ఆరుగురు మృతి మ‌రో ఏడుగురి ప‌రిస్థితి విష‌మం

Date : 02 December 2024 08:40 PM Views : 416

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండ‌లం ఆలూరు స్టేజీ వ‌ద్ద ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. కూర‌గాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డికక్క‌డే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఏడుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బాధితులంతా కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న వారేన‌ని పోలీసులు తెలిపారు. సుమారు 50 మందికి కాళ్లు, చేతులు విరగ‌డంతో అక్క‌డ భీతావ‌హ ప‌రిస్థితి నెల‌కొంది. బాధితులంతా న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఇక లారీ వేగానికి అక్క‌డున్న ఓ భారీ వృక్షం కూడా కుప్ప‌కూలింది. లారీ క్యాబిన్‌లో డ్రైవ‌ర్ చిక్కుకున్నాడు. లారీ వేగాన్ని చూసి స్థానికులు ప‌రుగులు పెట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :