Tuesday, 11 August 2026 01:48:06 PM

షార్ట్ సర్క్యూట్ తో తల్లి కూతురు మృతి...

Date : 29 October 2024 07:05 PM Views : 564

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రామ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ తో తల్లి కూతురితో పాటు రెండు మూగజీవాలు మృతి చెందిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...గ్రామానికి చెందిన గడ్డం కొమరమ్మ, కలువల పోచమ్మ లు ఇంట్లో ఉండగా అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఇల్లు అంత మంటలు వ్యాపించి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు మూగజీవాలతో పాటు ఇంట్లో ఉన్న గృహప్రకారణాలు దగ్ధం అయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనంతరం క్లూస్ టీంను రంగంలోకి దింపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :