Thursday, 25 June 2026 07:03:49 PM

విశాఖ జిల్లా మల్కాజిపురంలో దారుణం...

తల్లిని హత్య చేసిన కొడుకు...

Date : 31 January 2025 11:39 AM Views : 322

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని తీర ప్రాంత రక్షక దళం క్వార్టర్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్నా తల్లినే ఓ కసాయి కొడుకు కడతేర్చిన సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా నిత్యం ఆన్ లైన్ గేమ్స్‌ను తన మొబైల్ ఫోన్ లో ఆడుతున్న నేపథ్యంలో తల్లి ఆల్కా సింగ్‌ తన కుమారుడిని ఆన్ లైన్ గేమ్స్‌ ఆడవద్దని వాధించనందుకు విచక్షణ కోల్పోయి తల్లిని బలంగా కొట్టి చంపేశాడు.ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలీని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనా స్తలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.మృతురాలి భర్త ఇండియన్ నేవి అధికారిగా గుర్తించారు.ఆన్ లైన్ గేమ్స్ కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :