ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గోదావరి వంతెన పైనుండి దూకి సింగరేణి విశ్రాంత ఉద్యోగి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కొత్తగూడెం పట్టణానికి చెందిన మల్లేష్ సింగరేణిలో పని నచేసి పదవి విరమణ పొందారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ భద్రాచలం గోదావరి వంతెన పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు నదిలో నుండి మృతదేహాన్ని వెలికి తీసారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News