Wednesday, 11 February 2026 08:19:16 PM

మహిళా వీఆర్‌ఓ ఇంటికి వేళ్లి కోరిక తీర్చాలని బట్టలు విప్పిన ఎంఆర్ఓ...

ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగితే ఇస్తావా...? అంటూ వీఆర్‌ఓకి మెస్సేజ్ లు.. విఆర్ఓ తల్లి ఎంఆర్ఓకు దేహశుద్ధి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

Date : 31 July 2025 07:47 PM Views : 1038

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ మహిళా వీఆర్‌ఓపై ఆమె వృద్ధ తల్లి సమక్షంలోనే లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంఆర్‌ఓపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఈ దారుణాన్ని ప్రజల్లోకి బట్టబయలు చేసింది. ప్రభుత్వ హోదాలో ఉన్న ఓ అధికారి ఎంతగా తారతంచాలు మరచి అణగారిన వర్గాలపై అధికార భాషలో దురుసుగా ప్రవర్తించాడనే దానికిదే నిదర్శనమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.వివరాల్లోకి వెళ్తే… నాయుడుపేటలో నివాసం ఉంటున్న ఓ మహిళా వీఆర్‌ఓను అదే మండలానికి చెందిన ఎంఆర్‌ఓ గత కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అవసరాల పేరుతో తరచూ కాంటాక్ట్‌లోకి వచ్చి, మొదట్లో చిన్నచిన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టిన అతను, ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అలాగే ఇటీవల కాలంలో మెసేజ్‌ల రూపంలో ఆమెకు నేరుగా లైంగిక సంబంధాలకి సంబంధించిన సంబందితంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ వ్యవహరించటం ప్రారంభించాడు. "నీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగితే ఇస్తావా?" అనే సందేశాలతో ఆమెను మానసికంగా క్షోభకు గురిచేశాడు. సాయంత్రం సమయంలో ఎవ్వరికి చెప్పకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లిన ఎంఆర్‌ఓ, ఆమెను చూడగానే బట్టలు విప్పాడు. తన కోరిక తీర్చాలని బలవంతం చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమెను శారీరకంగా సమీపించేందుకు ప్రయత్నించాడు. ఈ పరిస్థితుల్లో తీవ్ర భయంతో వున్న మహిళా వీఆర్‌ఓ తండ్రి వాదించలేనివల్ల తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఆమె తల్లి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడింది. ఎంఆర్‌ఓని బూతులు తిట్టుతూ, చెంపదెబ్బల వర్షం కురిపించింది. "నీకు ఈ వయసులో లైంగిక కోరికలు రావడమే నీవంటి నీచులకు సిగ్గుచేటు" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం ఘటనలో ఉన్న కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై నాయుడుపేట ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వ హోదాలో ఉన్న వారే ఇలా వ్యవహరిస్తే, సాధారణ మహిళలు ఎలా ఉద్యోగాలు చేస్తారు?" అంటూ పలువురు మండిపడుతున్నారు. "ఎంఆర్‌ఓ స్థాయిలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించగలిగితే, కిందస్థాయి అధికారుల పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న" అని నెట్‌జన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఇప్పుడే స్పందించకపోతే ఇలాంటివి మరింత ప్రబలే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి, తక్షణమే అధికార స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యుడిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్‌లో మహిళా వీఆర్‌ఓ ఫిర్యాదు ఇవ్వనుండగా, కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. ఈ దారుణ ఘటన మళ్లీ ఒకసారి మహిళల సురక్షితతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉద్యోగ స్థలాల్లో మహిళల భద్రతేంటి? అధికార హోదాలో ఉన్న వారే వేధింపులకు పాల్పడితే పరిష్కారం ఏంటి? మహిళలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ వ్యవస్థలోని కొందరు వ్యక్తుల వల్లే వారు బాధలు పడాల్సి వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ప్రజల వత్తిడితో జిల్లా యంత్రాంగం స్పందించి, సంబంధిత ఎంఆర్‌ఓపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అంటున్నారు అధికారులు. కేసు న్యాయపరంగా ఎలా సాగుతుందన్న దానిపై తుది నిర్థారణ రావాల్సి వుంది. కానీ, ఇప్పటికే అధికార దుర్వినియోగానికి సంకేతంగా నిలిచిన ఈ ఘటన... ప్రభుత్వ వ్యవస్థపై గౌరవాన్ని దిగజార్చే విధంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :