Thursday, 25 June 2026 07:57:04 PM

యువకుడిని చెట్టుకు కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం...

Date : 04 October 2024 05:12 PM Views : 536

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / అంతర్జాతీయం : యువతి పై గుర్తు తెలియని యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనా మహారాష్ట్రలోని పూణెలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం పూణె కు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి గురువారం అర్థరాత్రి బోప్ దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని ముగ్గురు యువకులు యువకుడి పై దాడి చేసి చెట్టుకు కట్టేశారు. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో ఆ జంట దగ్గరలోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :