ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం దారారం గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు డీ కొనడంతో నాగమల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News