ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో పరువు హత్యకు పాల్పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వడ్లకొండ కృష్ణ అనే యువకుడు గత ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకొన్నట్టు సమాచారం. ఏ నేపథ్యంలోనే బాధితుడిని బండరాళ్లతో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మృతుడి బాడీని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ నది కట్టపై విసిరేశారు. దింతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.
Admin
Aakanksha News