Friday, 11 July 2025 05:30:20 AM

కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు....

Date : 05 July 2025 02:40 PM Views : 190

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్ అనే అధికారి రైతు నుంచి పట్టు (పాస్‌బుక్) పనికి రూ.10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.లంచం డబ్బును కెమికల్ పరిక్షకు లోను చేయగా అవి అవినీతి డబ్బులేనని నిర్ధారణ అయింది. వెంటనే నవీన్‌ను అదుపులోకి తీసుకొని పైసీ అధినియమం (PC Act 1988) కింద కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల సమక్షంలో కార్యాలయంలోని పలు పత్రాలు, కంప్యూటర్లను పరిశీలించారు. ఈ దాడితో స్థానికంగా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :