ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పెద్దపల్లి జిల్లా : మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రధాన రహదారిపై వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కారు అతివేగంగా డీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... మంథని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న సంపత్ రెడ్డి రోజులాగే వాకింగ్ చేస్తూ ఉండగా లారీని ఓవర్ టెక్ చేయబోయి ఓ కారు అతివేగంగా సంపత్ రెడ్డిని డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News