Friday, 17 April 2026 01:30:12 PM

ఈ నెల 21న ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల భాద్యతల స్వీకరణ...

రసవత్తరంగా ఆంద్రప్రదేశ్ రాజకీయాలు

Date : 18 January 2024 10:34 AM Views : 940

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంద్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సభలు, సమావేశాలను నిర్వహిస్తుండగా మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలవడం ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనువెంటనే ఆంద్రప్రదేశ్ ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించడంతో ఆంద్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు నుండి రాజకీయ వ్యతిరేకత వ్యక్తమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారికంగా అంగరంగ వైభవంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :