ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రాయుడు శ్రీను (ఎస్.ఎల్.టి. శ్రీను) మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయుడు శ్రీనుబాబు (జెమిని శ్రీను) ఆదేశానుసారం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సభ్యులు అందరూ కలిసి మాతృవియోగంతో బాధపడుతున్న రాయుడు శ్రీను ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రాయుడు శ్రీనుకి ధైర్యం చెప్పి, యూనియన్ అన్ని విధాల తోడుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రెటరీ వేగా శ్యాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బళ్ళ సురేష్, కోశాధికారి కొమ్మనాపల్లి రామకృష్ణ, సభ్యులు సునీల్ కుమార్ యాండ్ర, దాకే సింహాచలం, బి.చిన్నబ్బాయి, దడాల సత్తిబాబు, సాగర్, లోవరాజు, దొరబాబు, ఫణి, ప్రసాద్, కాకి గోవింద్, పుల్లారావు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
Admin
Aakanksha News